టీ డబ్లుజేయఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వినతిపత్రం
మన ప్రగతి న్యూస్/ వరంగల్
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో
వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా విజయవంతం. తరలి వచ్చిన జర్నలిస్టులోకం. అనంతరం వరంగల్ డీఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమం లో వరంగల్ జిల్లా ఇన్ ఛార్జి, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి బొక్క దయసాగర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పోడేటి అశోక్, కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్, జిల్లా కోశాధికారి గాయపు రాజు రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చిక వెంకటేశ్వర్లు, ఈర్ల సురేందర్ , కుమారస్వామి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఆనంతుల రమేష్, జిల్లా ఆఫీస్ బేరర్లు కొమ్ము రాజు, కే వెంకట్, ఎం శ్రీనివాస్, విజయ్ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

