సాగునీటి వసతుల మెరుగుదలపై అధికారులకు కీలక సూచనలు
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
ఏన్కూరు మండలంలోని గార్లఒడ్డు చెరువును ఆదివారం సాయంత్రం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పరిశీలించారు. సాగర్ కెనాల్ నుంచి చెరువులోకి నీటిని మళ్లించే అవకాశాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు సకాలంలో సాగునీరు అందేలా అవసరమైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చిరాం నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లాలూ నాయక్, మాజీ ఎంపీటీసీ మేడా ధర్మారావు, జిల్లా కమిటీ కార్యదర్శి సామెల్, తాళ్లూరి నవీన్, సైదులు, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


