మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
నల్లబెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసు నమోదు అయినట్టు స్థానిక ఎస్సై సాయి ప్రసన్నకుమార్ తెలిపారు. మైసంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ బీ, 65 సంవత్సరాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె తమ్ముడు మహమ్మద్ అంకూస్ తండ్రి పేరు యాకూబ్, 58 సంవత్సరాలు, ఏ.ఆర్. కానిస్టేబుల్గా ములుగు జిల్లా నందు పనిచేస్తూ దస్తగిరిపల్లి గ్రామంలో నివసించుచుండగా, 7వ తేదీన న సాయంత్రం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినాడు. మృతదేహంపై గాయాలు, చెవి నుండి రక్తస్రావం ఉండటం తో స్థానికుల సమాచారం ప్రకారం, మృతుడు తన భార్య ఫాతిమా బేగం , కుమారుడు అయూబ్ పాషాతో గొడవల నేపథ్యంలో దాడికి గురై హత్య చేయబడినట్లు వెల్లడైంది. ఈ మేరకు మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, భార్య ఫాతిమా బేగం , కుమారుడు అయూబ్ పాషా లపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగించడమైనది అని తెలిపారు.


