- హుజురాబాద్ ఎసిపి మాధవి, జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్..
మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్:
యువత దేశానికి పట్టుకొమ్మలని, వారు డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు, ఇసుక అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉండి ఉన్నత శిఖరాల ను అధిరోహించాలని శనివారం జమ్మికుంట మండల పరిధిలోని విలసాగర్ గ్రామంలో యువతకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా హుజురాబాద్ ఎసిపి మాధవి తో పాటు.. జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణ మాట్లాడారు. యువత తమ బంగారు భవిష్యత్తును పాడుచేసే డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసలు కావద్దని హితవు పలి కారు. అదేవిధంగా, ఎలాంటి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడవద్దని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు యువత సహకరించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడబోమని ఎసిపి, సిఐ లు విలసాగర్ గ్రామ యువతతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

