Breaking News

రామన్నపేటలో విషాదం.. నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి

మన ప్రగతి న్యూస్ /వేములవాడ నియోజకవర్గం:

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో శనివారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిప్పని జలంధర్, శిరీష దంపతుల రెండేళ్ల కుమార్తె విశ్వైక ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నుంచి ఇంటికి వచ్చిన అనంతరం తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా, చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన తండ్రి వెంటనే చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసింది.కళ్ల ముందే రెండేళ్ల కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటనతో రామన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

జీబ్లక్ పల్లిలో వివాహిత ఆత్మహత్య