Breaking News

దుబ్బాక: నాయి బ్రాహ్మణ యువకుడి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/దుబ్బాక

ఆర్థిక ఇబ్బందులతో నాయి బ్రాహ్మణ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన దుబ్బాక పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. లచ్చ పేటకు చెందిన మిరుదొడ్డి స్వామి (42) దుబ్బాక లోని ఓ అద్దె షటర్ లొ కులవృత్తిని కొనసాగిస్తున్నాడు. కొంతకాలంగా వృత్తి సాగక ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్థాపానికి గురై షాప్ లోనే ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం..