Breaking News

వేములవాడ జయవరం వద్ద రోడ్డు ప్రమాదం..

రేకుర్తి యువకుడు అక్కడికక్కడే మృతి

మనప్రగతి న్యూస్/వేములవాడ ప్రతినిధి:

ఈదురుగాలుల ధాటికి ఆరు ఇళ్ల పైకప్పులు ధ్వంసం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని జయవరం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కరీంనగర్ సమీపంలోని రేకుర్తి గ్రామానికి చెందిన దానే రమేశ్ (30) తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం వేములవాడ శివారులోని జయవరం వద్ద అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని, ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన రమేశ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.