మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:
నల్లబెల్లి గ్రామానికి చెందిన యువకుడు అల్లే ప్రశాంత్( 23 ) రైలు కింద పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం వేరకు.. ప్రశాంత్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమా చారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


