Breaking News

మహిళల భద్రతే.. సమాజ శ్రేయస్సు..

  • ఎంపీడీవో రామకృష్ణ..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

మహిళల భద్రతే సమాజ శ్రేయస్సు అని నడికూడ ఎంపీడీవో ఆర్. రామకృష్ణ అన్నారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహిళల పరిరక్షణకై ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేయించారు. మహిళల గౌరవం, భద్రత మరియు సమానత్వాన్ని పరిరక్షిస్తామని, అన్ని రకాల లైంగిక వేధిం పులను నివారించడానికి, నిషేధించడానికి, మరియు వాటిపై ప్రతిస్పందిం చడానికి కట్టుబడి ఉన్నామని, సురక్షితమైన, గౌరవ ప్రదమైన, సమ్మిళీతమైన కార్యాలయ వాతావరణాన్ని కల్పిస్తామని, బాధితులు నిర్భయంగా మాట్లాడేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. పివో ఎస్ హెచ్ చట్టం 2013 ప్రకారం సరైన పరిష్కార యంత్రాంగాల ద్వారా న్యాయం జరిగేలా చూస్తామని, అంతే కాకుండా, ప్రతి వ్యక్తిని గౌరవంగా చూస్తామని, అలాగే వివక్ష, బెదిరింపులు, వేధింపులు లేని కార్యాలయ వాతావరణానికి దోహద పడతామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నడికూడ సర్పంచ్ కుడ్ల మలహాల్ రావు, ఉప సర్పంచ్ తరిగొప్పుల సంపత్, నాయకులు ఓదెల సమ్మయ్య, అంగ న్వాడీలు నారగాని అనిత, దుప్పటి సంపూర్ణ, దుప్పటి వినోద, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మండల బాలల పరిరక్షణ కమిటీ నియామకం..