- మిర్చి తోటలో కూలి పనులకు వెళ్లి తిరిగొచ్చిన కొద్దిసేపటికే మృత్యు వాత.
మన ప్రగతి న్యూస్/గూడూరు:
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలో వడ దెబ్బతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. గ్రామానికి చెందిన కొట్టెం భద్రమ్మ (60) శుక్ర వారం ఉదయం మిర్చి తోటలో కూలి పనులకు వెళ్లింది. ఎండ తీవ్రత అధికం గా ఉండటంతో తోటలోనే తీవ్ర అస్వస్థతకు గురైంది. అక్కడ ఉన్న తోటి కూలీలు గమనించి వెంటనే ఆమె ను ఇంటికి పంపించారు. ఇంట్లో సేద తీరు తుండగానే భద్రమ్మ పరిస్థితి విషమించి,మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. భద్రమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉద యం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రావొ ద్దని, కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

