Breaking News

నడికూడ మండల నూతన ప్రెస్ క్లబ్ ఏకగ్రీవ ఎన్నిక..

  • అధ్యక్షులుగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచనేని భాస్కరరావు నియామకం..

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

నడికూడ మండల కేంద్రంలో ఆది వారం మండల జర్నలిస్టుల సమీక్ష సమా వేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఈ సమావేశంలో జర్న లిస్టు మిత్రుల సూచన మేరకు అభిప్రాయాల మేరకు సమస్యల పరిష్కారం నూతనంగా ఏర్పడిన నడికూడ మండల కేంద్రంలో నూత న ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది. నడికూడ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచనేని భాస్కరరావు లను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మండల ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా గడ్డం బాల రాజు, ఉపాధ్యక్షులుగా ముక్కెర చిరంజీవి, ఐలి విజయ్, సహాయ కార్యదర్శిగా.. బొమ్మ అశోక్, భైరి సుధీర్ కుమార్, కోశాధికారిగా ఎండి జమాలుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా.. బెజ్జంకి రాజేందర్, తోంబురపు రజనీ కాంత్, తాళ్ల రవి, చుక్క సతీష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ.. నడికూడ మండల నూత న ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా కమిటీ సభ్యు లుగా ఎన్నుకున్న ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామని, నిబంధనలకు అనుగుణంగా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మండల కేంద్రంలో పనిచేయుచున్న జర్నలిస్టు మిత్రులు ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్న, కమిటీ సభ్యుల దృష్టకి తీసుకు రావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మండల కేంద్రంలోని అధికారులు, రాజకీయ నాయకులు ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి సహకరించాలని కోరారు.

సర్పంచ్ల ఫోరం కుశాధికారిగా మందపల్లి మరియ ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక