మన ప్రగతి న్యూస్/ ఆత్మకూరు:
జిల్లా సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్ల చైతన్య సదస్సు ను జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చల్లా రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలంలోని పెంచికల పేట గ్రామ సర్పంచ్ మందపల్లి మరియా ప్రసాద్ ను హనుమకొండ జిల్లా సర్పంచుల ఫోరం జిల్లా కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మరియా ప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా కోశాధికారిగా నియమించినందుకు నాకు ఇచ్చిన బాధ్యతలను సర్పంచ్ల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని, గ్రామ పంచాయతీల అభివృద్ధి స్థానిక సంస్థల బలవపేతాను సర్పంచ్ల హక్కుల పరిరక్షణ కోసం జిల్లా సర్పంచుల ఫోరం తరపున అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. జిల్లా సర్పంచులందరూ ఐక్యంగా ఉండి గ్రామాల అభివృద్ధి కి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లా అధ్యక్షుడు చల్లా రాకేష్ రెడ్డి, జిల్లా ఫోరం నాయకులకు, సర్పంచులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


