Breaking News

బాలాజీనగర్‌లో వివాహిత ఆత్మహత్య

  • ​భర్త, అత్తమామలపై కేసు నమోదు

    మన ప్రగతి న్యూస్ / జవహర్ నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి శాంతినగర్‌లో మజ్జారి రేఖ (21) అనే వివాహిత శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… శాంతి నగర్‌కు చెందిన రేఖకు సుమారు మూడు సంవత్సరాల క్రితం ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సాయికిరణ్‌తో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ​శుక్రవారం మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేఖ తన బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. అనంతరం ఇంటికి వచ్చిన అత్త గమ నించి, స్థానికుల సహాయంతో కిందకు దించే లోపే రేఖ మృతి చెందింది. సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీస్ క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. ​

కట్నం వేధింపులే కారణం:

రామన్నపేటలో విషాదం.. నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి

తల్లి ఫిర్యాదు తన కుమార్తె మరణానికి అల్లుడు సాయికిరణ్, అత్తమామల వేధింపులే కారణమని మృతురాలి తల్లి జయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.