Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం..

  • ఇద్దరు మృతి ..ఒకరికి తీవ్ర గాయాలు..

మన ప్రగతి న్యూస్/గంభీరావు పేట:

గంభీరావుపేట మండల కేంద్రానికి చెంది న ముగ్గురు యువకులు శుక్రవారం రాత్రి కామారెడ్డి నుండి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో మాచారెడ్డి నిర్మల రహదారి మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యా రు. ఇందులో ఒకరు అక్కడి కక్కడే మృతి చెందగా.. మరొకరు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమా దంలో ఇద్దరు మృతి చెందడంతో.. మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుండి గంభీరావుపేట కు షిఫ్ట్ కారులో వస్తుండగా.. దారితప్పి కాకుల గుట్ట తండా సమీపంలోని కోళ్ల ఫారం మలుపు వద్ద మర్రి చెట్టుకు బలంగా ఢీకొనడంతో కోట అనిల్ యాదవ్ (24) అక్కడికక్కడే మృతిచెందగా.. అన్వేష్ గౌడ్ (23) హైదరాబాద్ ఆసుపత్రి లో ఈ చికిత్స పొందుతూ మృతి చెందాడు, మరొకరు వికాస్ (22) తీవ్ర గాయాలతో ఉండగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు, ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. వీరు ముగ్గురు ఓకే తరగతికి చెందిన క్లాస్మేట్ లు ముగ్గురిలో ఇద్దరు స్నేహితులు మృతి చెందడంతో.. తోటి స్నేహితులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి..

మృతుడి ఫైల్ ఫోటో..