Breaking News

ఏన్కూరులో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు వైరా ఎమ్మెల్యే బహుమతుల ప్రదానం

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

ఏన్కూరు మండల కేంద్రంలో తరుణ్ మెమోరియల్ ఆధ్వర్యంలో, గరుడ సహకారంతో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ విజేత జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు ప్రదానం చేశారు.టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఖమ్మం జట్టు ప్రథమ బహుమతిని కైవసం చేసుకోగా, ఏన్కూరు జట్టు ద్వితీయ బహుమతిని సాధించింది. విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేయగా క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాసు నాయక్ మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, అభిమానులు, స్థానిక యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వేములవాడ జయవరం వద్ద రోడ్డు ప్రమాదం..