Breaking News

టీఎల్‌పేట గ్రామంలో వర్షపు నీటి తో రోడ్లపైకి నీరు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

ఏన్కూరు మండలం టీఎల్‌పేట గ్రామంలోని అంబేద్కర్ నగర్ వద్ద శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై నీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు పంచాయతీ అధికారులు రహదారికి ఇరువైపులా పంచాయతీ ట్రాక్టర్లను అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలను నియంత్రించేవారని,ప్రజలను అప్రమత్తం చేసేవారని గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వెంటనే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అదును పదును చూసి పత్తి విత్తనాలు వేయాలి రైతులకు ఏవో బాలాజీ సూచన