
మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:
ఏన్కూర్ మండల పరిధిలోని తూతక్కలింగన్నపేట గ్రామంలో వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఈద అప్పారావు (83) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా తీవ్ర ఎండలు ఉండటంతో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గ్రామంలో ఈ ఘటన విషాదాన్ని నింపింది
