- 510 మంది విద్యార్థులకు త్రాగునీరు కరువు శీర్షిక..
- పరిశీలించిన జిల్లా సీఎంఓ అధికారి ప్రతాప్ రెడ్డి..
- హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు..
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:
వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 510 మంది విద్యార్థులు ఎదుర్కొంటు న్న సమస్యలను మన ప్రగతి తెలు గు దినపత్రికలో ” 510 మంది విద్యార్థులకు త్రాగునీరు కరువు ” అనే శీర్షిక ద్వారా ప్రచురితమైన వార్తకు బుధవారం వనపర్తి జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధి కారి ప్రతాప్ రెడ్డి మరియు ఎంఈ ఓ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చేరు కొని విద్యార్థులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను విద్యార్థుల ను మరియు అక్కడి ఉపాధ్యా యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని,ఈ సమస్యను ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. వీరి వెంట పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉన్నారు.



