మన ప్రగతి న్యూస్/
భూదాన్ పోచంపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జిబ్లక్ పల్లి గ్రామంలో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామానికి చెందిన నడిగొండ మానస (30) శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసు కుని ఆత్మహత్య చేసుకుందని స్థానిక పోలీసులు శనివారం నాడు తెలియజేశారు. ఈమె భర్త అయిన గణేష్ పాత సామాన్ల (స్క్రాప్) వ్యాపారం చేస్తుంటాడని, వ్యాపార ని మిత్తం ఫైనాన్స్ ద్వారా ఒక ఆటోను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. కొంత కాలానికే వ్యాపారం సరిగ్గా నడవక పోవడంతో అప్పుల పాలై హార్దిక సమ స్య ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు. దీంతో తన కుమార్తెమన స్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి కే. యాదయ్య చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్ చేస్తున్నట్టు తెలిపారు.

