Breaking News

వర్షాల కోసం గ్రామస్తుల పూజలు..

  • ముస్త్యాలపల్లి లో కప్పతల్లి ఆటలు.

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

హనుమకొండ జిల్లా నడికూడ మండల వ్యాప్తంగా తీవ్ర వర్షా భావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. పత్తి విత్తనాలు వేసిన రైతులు వర్షాల కోసం వరుణ దేవుని వేడుకుంటున్నారు. శుక్ర వారం రోజున మండలంలోని ముస్త్యాల పల్లి గ్రామంలో రైతులు, మహిళలు, యువ కులు వర్షాలు కురవాలని కోరు తూ కప్పతల్లి ఆటలు ఆడారు. కప్పను కావడికి కట్టి ఊరంతా తిప్పుతూ పూజ లు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆ కప్పపై నీళ్ళు పోస్తూ ఆటా పాటలతో ఊరంతా తిరిగారు. ఈ సంద ర్భంగా గ్రామ సర్పంచ్ మేకమల్ల వెంకటే ష్ మాట్లాడుతూ.. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, వర్షాలు సమృ ద్ధిగా వర్షాలు కురిసి రైతులు సంతో షంగా ఉండాలని కోరుతూ.. గ్రామ దేవతలకు పూజలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామస్తులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మన ప్రగతి కథనానికి స్పందన..