Breaking News

వేములవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

చిన్నారులు అధికంగా వినియోగించే పానీపూరి, చాట్ బండ్లపై ప్రత్యేక దృష్టి

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

మన ప్రగతి న్యూస్ /వేములవాడ ప్రతినిధి:

నకిలీ విత్తనాల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకునేదే లేదు చట్టబద్ధంగా కఠిన చర్యలు తప్పవు : ఏవో బాలాజీ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా చిన్నారులు అధికంగా వినియోగించే పానీపూరి, చాట్ బండ్లతో పాటు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆహార పదార్థాల తయారీ, నిల్వ విధానాలు, ఉపయోగిస్తున్న ముడి సరుకుల నాణ్యతను తనిఖీ చేసి వ్యాపారులకు పలు సూచనలు చేశారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యతలేని, అపరిశుభ్రమైన ఆహార పదార్థాలను విక్రయించవద్దని హెచ్చరించారు.ఆహార భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యాపారం నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తెలిపారు.