Breaking News

యువకుడిని ఢీ కొట్టిన ట్రాలీ ఆటో..

మన ప్రగతి న్యూస్/ చొప్పదండి నియోజకవర్గం:

చొప్పదండి మండలంలోని ఆర్నకొండ గ్రామానికి గుంట మహేష్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న గ్రామంలో చొప్పదండి నుండి ధర్మారం వైపు వెళ్తున్నటువంటి ర్యాలీ ఆటో మహేష్ ను వెనక నుండి డీ కొట్టడంతో వెంటనే గుంట మహేష్ను మొదటగా ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించడం జరిగిందని చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపినారు. తర్వాత మెరుగైన చికిత్స గురించి అపవాలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహేష్ మరణించడం జరిగిందని ఎస్ ఐ తెలిపినారు. వివరాల్లోకి వెళితే మరణించిన వ్యక్తి చొప్పదండి మండలం అరనకొండ గ్రామానికి చెందిన గుంట మహేష్(25) తండ్రి బీరయ్య హమాలిగా పని చేసుకుంటున్నాడు చొప్పదండిలో అమరగుంట సురేష్ యొక్క కుమార్తె వివాహం జరిగినది మట్టి వివాహానికి పెళ్లి భరత్ కు మహేష్ ఇంటి నుండి 9 గంటలకు వెళ్ళినాడు పెళ్లి భరత్ ముగించుకొని తిరిగి ఇంటికి నడుచు కుంటూ వచ్చే క్రమంలో రాత్రి అనగా 24వ తేదీ బుధవారం రోజున రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో చొప్పదండి నుండి ధర్మారం వైపు వెళ్తున్నటువంటి ట్రాలీ ఆటో (టిఎస్ 17 టీ 4056) మర్లవాడ వద్ద నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మహేష్ను వెనక నుండి ఢీకొట్టడంతో మహేష్ ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించడం జరిగింది తర్వాత మెరుగైన చికిత్స గురించి అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహేష్ మరణించడం జరిగిందని ఎస్సై నరేష్ రెడ్డి తెలిపినారు ఇటీ విషయం పైన మరణించిన యువకుడి తండ్రి బీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా ర్యాలీ ఆటో డ్రైవర్ గుమ్మడి తిరుపతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపినారు.

మన ప్రగతి కథనానికి స్పందన..