మన ప్రగతి న్యూస్/పరకాల:
వి బి జి రామ్ జి పథకంలో పరకాల మం డలం నాగారం గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న గడ్డం కోమల మరియు గ్రామ పంచా య తీ కార్యదర్శి కిరణ్ టెక్నికల్ అసిస్టెంట్ సుమల త, కంప్యూటర్ ఆపరేట ర్ శ్రీకాంత్ మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ చిరంజీవి పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ మొగిలి లను 2025-26 సంవత్సరంలో అత్యధిక పని దినాలు చేసినందుకు గాను విధులలో నిర్లక్ష్యం వహించకుండా సక్రమంగా విధులు నిర్వహించి నందుకు గాను వారందరినీ వి బి జి రాంజీలో ఉత్తమ ఉద్యోగులుగా గుర్తించి బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ ఇన్చార్జి అభివృద్ధి అధికారి ఆర్. రామకృష్ణ, మండల పరిషత్ సూపర్డెంట్ ఏపీవో ఇంది ర ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

