
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు ఆశీర్వాద సభలో ఏర్పాటు చేసిన భారీ వ్యవసాయ ఎగ్జిబిషన్ను సందర్శించేందుకు ఏన్కూర్ మండలం నుంచి రైతులు గురువారం ఉదయం ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు.
ఏన్కూర్, మూలపోచారం, నాచారం గ్రామపంచాయతీలకు చెందిన రైతులు మూడు ప్రత్యేక బస్సుల్లో సభా ప్రాంగణానికి తరలివెళ్లారు. ఎగ్జిబిషన్లో నాణ్యమైన విత్తనాలు, అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు, వ్యవసాయ పరికరాలు, ఎరువులు, పురుగుమందులు, నూతన సాగు సాంకేతికతకు సంబంధించిన స్టాళ్లను సందర్శించి అవగాహన పొందనున్నారు.రైతులతో పాటు మండల వ్యవసాయ అధికారి ఎ. నరసింహారావు, ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ, ఏఈవోలు కూడా సభకు బయలుదేరారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అవగాహన పెంపొందించుకోవాలని అధికారులు సూచించారు.
