Breaking News

ముద్రగడ పద్మనాభం మృతికి మాజీ ఎంపీ నామ సంతాపం

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలు, కాపు సామాజిక వర్గ హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భగవంతుడు వారికి ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ముద్రగడ పద్మనాభం మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం