మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
శనిగరం శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు ఖానాపురం మండలం అశోక్నగర్కు చెందిన దేవేందర్గా గుర్తించారు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న ఆయన గురువారం ఉదయం కూలీలను ఆటోలో మూడు చెక్కలపల్లికి తీసుకెళ్లి అక్కడ దించిన అనంతరం సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


