బ్రేకింగ్ న్యూస్
డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్
తెలంగాణ

డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

మన ప్రగతి న్యూస్/వైరా ప్రతినిధి:

చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశం

ప్రముఖ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ కే. జగదీష్‌ అకాల మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్‌ జగదీష్‌ మృతి తనకు వ్యక్తిగతంగా, మమతా వైద్య విద్యా సంస్థలకు, ఖమ్మం జిల్లా ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.2012లో మమతా వైద్య సంస్థల్లో చేరిన డాక్టర్‌ జగదీష్‌ తక్కువ కాలంలోనే సిబ్బంది, విద్యార్థులు, రోగులు, ప్రజలకు ఆప్తుడిగా మారారని అజయ్‌కుమార్‌ గుర్తుచేశారు. రోగుల పట్ల ఆయన చూపిన ఆప్యాయత, వైద్య వృత్తిపై ఉన్న అంకితభావం, సేవా దృక్పథం ప్రశంసనీయమన్నారు. మమతా ఆసుపత్రిలో న్యూరోసర్జరీ విభాగాన్ని బలోపేతం చేయడంలో, పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించడంలో ఆయన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు.ఖమ్మం ఐఎంఏ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా డాక్టర్‌ జగదీష్‌ వైద్య రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయన చేసిన కృషిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.డాక్టర్‌ జగదీష్‌ తనకు తమ్ముడిలాంటి వారని అజయ్‌కుమార్‌ భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఏ చిన్న గుర్తింపు లభించినా ఎంతో సంతోషంగా తనను కలిసి పంచుకునేవారని తెలిపారు. చివరి శ్వాస వరకు మమతా సంస్థల్లోనే ఉంటానని జగదీష్‌ చెప్పిన మాటలను స్మరించుకున్నారు.నిన్నటి వరకు తమతో ఎంతో ఆప్యాయంగా ఉన్న ఆయన నేడు తమ మధ్య లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఒంగోలు నుంచి వచ్చిన డాక్టర్‌ జగదీష్‌ భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.భగవంతుడు డాక్టర్‌ జగదీష్‌ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.