మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూల్చివేయడంపై ఆయన సతీమణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని కూల్చిన ఘటనను తలచుకుని ఆమె కంటతడి పెట్టారు. భర్త జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని కన్నీటి పర్యంతమయ్యారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయనను అభిమానించే ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా విగ్రహాన్ని కూల్చడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకుని, విగ్రహాన్ని పునరుద్ధరించాలని ఆమె కోరారు.

