
మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:
ఖమ్మం నగరంలో శనివారం సాయంత్రం బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పర్యటించారు. నెహ్రునగర్లో నూతనంగా ప్రారంభించిన డాక్టర్ జ్యోత్స్న మెటర్నిటీ, ఫెర్టిలిటీ హాస్పిటల్ను సందర్శించిన వారు ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, వార్డులు, ల్యాబ్తో పాటు ఇతర వైద్య సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన ప్రసూతి, ఫెర్టిలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. అనంతరం ఆసుపత్రి నిర్వాహకులు పెద్దినేని క్రిష్ణమూర్తి, డాక్టర్ శ్రీకాంత్ పెద్దినేని, డాక్టర్ జ్యోత్స్న పెద్దినేని ఆధ్వర్యంలో నామ, వద్దిరాజులను శాలువాలతో సన్మానించారు.నూతన వధూవరులకు నామ ఆశీర్వాదంటేకులపల్లి గ్రామం, ఖానాపురం హవేలీ వాస్తవ్యులు, మాజీ సుడా డైరెక్టర్ దొంగల తిరుపతిరావు ఇందిరల కుమార్తె వివాహం ఇటీవల వీరబాబుతో జరిగింది. ఈ సందర్భంగా శనివారం వారి స్వగృహానికి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.చింతల లింగయ్య కుటుంబానికి నామ పరామర్శతెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతల లింగయ్య ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం ఆయన స్వగృహానికి వెళ్లారు. లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, లింగయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. లింగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

