మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
పెద్ది విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ నల్లబెల్లిలో బిఆర్ఎస్ శ్రేణులు బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగామూతపడ్డాయి. పలు పాఠశాలలను సైతం బంద్ చేయించారు.పెద్ది విగ్రహం కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వ్యాపార సంస్థలను, పాఠశాలల యాజమాన్యాలను కలిసి బంద్కు సహకరించాలని కోరారు. దీంతో నల్లబెల్లిలో బంద్ వాతావరణం నెలకొంది.విగ్రహం కూల్చివేతకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బిఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.



