క్రమశిక్షణకు మారుపేరు అయ్యప్ప దీక్ష
సుఖసంతోషాలకు ధరించండి అయ్యప్ప మాల
వల్లంపట్ల పోచయ్య
మన ప్రగతి న్యూస్/ వేములపల్లి

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్ గ్రామానికి చెందిన వల్లంపట్ల పోచయ్య ప్రతిసారి అయ్యప్ప మాల ధరిస్తూ శభరికి వెళ్లి మణికంఠుని దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించడం వలన ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటున్నానని అయ్యప్ప మాల క్రమశిక్షణకు మారుపేరని అయ్యప్ప దీక్ష తీసుకోవడం చాలా మంచిదని అన్నారు. నా గ్రామ ప్రజలు బంధువులు శ్రేయోభిలాషులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని అందరు బాగుండడమే మనకు రక్ష అని తెలిపారు. అయ్యప్ప మాల ధరించండి చెడు అలవాట్లకు దూరం కండి అని పిలుపునిచ్చారు. అయ్యప్పను కొలిచిన వారికి కోరిన కోర్కెలు తిరుతాయని తెలిపారు. అయ్యప్ప మాల ధరించండి అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవదేవుని పూజించానని తెలిపారు.
