మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలోని సీతరామచంద్ర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఆలయ పూజారి కృష్ణ స్వామి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రానికి చెందిన దంపతులు పాల్గొని సత్యనారాయణ వ్రతాలను ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.


