మన ప్రగతి న్యూస్/నడికూడ:
వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన దుక్కిటెద్దులు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా.. ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల సమ్మయ్య యాదవ్ తన వ్యవసాయ పనుల నిమిత్తం తన పొలా నికి ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు ముగించుకొని, తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో స్థానిక చిన్న వాగు దాటుతున్న సమయంలో ప్రమాదవ శాత్తు ఒక దుక్కిటెద్దు, గతంలో దారి కోసం వేసిన పైపులో జారిపడి, కాళ్లతో సహా.. శరీర సగభాగం పైపులో ఇరుక్కొ ని, ఊపిరాడక మృతి చెందినట్లు స్థాని కులు తెలిపారు. జెసిబి సహాయంతో బయటకి తీశారు. దీని విలువ సుమారు 80 వేలు ఉంటుందని,అదే విధంగా మరో దుక్కిటెద్దు మరియు రైతు సమ్మయ్య సురక్షితంగా బయటికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా.. పాలకులు చిన్న వాగు పై, మరమ్మతులు చేపట్టి ప్రజలను,మూగజీవాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.


