మన ప్రగతి న్యూస్ /కమలాపూర్:
వృత్తిలో భాగంగా..ట్రాక్టర్ తో పొలం దు న్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి చెందిన ఘట న హనుమకొండ జిల్లా కమలాపూర్ మం డల పరిధిలోని భీంపల్లి గ్రామంలో బుధ వారం సాయంత్రం ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అరకాల కుమారస్వామి (50) (ట్రాక్టర్ డ్రైవర్) వరి నాట్ల సీజన్ కావడంతో అంకుశాపురం శివారులో పొలం దున్ను తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ కుమారస్వామి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.


