Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..

మన ప్రగతి న్యూస్ /కమలాపూర్:

వృత్తిలో భాగంగా..ట్రాక్టర్ తో పొలం దు న్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి చెందిన ఘట న హనుమకొండ జిల్లా కమలాపూర్ మం డల పరిధిలోని భీంపల్లి గ్రామంలో బుధ వారం సాయంత్రం ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అరకాల కుమారస్వామి (50) (ట్రాక్టర్ డ్రైవర్) వరి నాట్ల సీజన్ కావడంతో అంకుశాపురం శివారులో పొలం దున్ను తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ కుమారస్వామి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..