Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..

  • కుటుంబానికి రూ.31 లక్షల నష్టపరిహారం
    చర్లపల్లి సుదర్శన్ ఐరన్ ఫాబ్రికేషన్స్‌లో విషాదం..
  • సీఐటీయూ చొరవతో యాజమాన్యం దిగివచ్చింది.. భార్య, ఇద్దరు చిన్నారులకు ఆర్థిక భరోసా

మన ప్రగతి న్యూస్ / చర్లపల్లి, మేడ్చల్, జిల్లా స్టాపర్ :

చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని ఫేజ్–2లో ఉన్న సుదర్శన్ ఐరన్ ఫాబ్రికేషన్స్‌లో బుధవారం జరిగిన ఘోర పారిశ్రామిక ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కంపెనీలో సీఎన్‌సీ లేజర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న భత్తుల సురేష్‌బాబు (42) ప్రమాదవశాత్తు సీఎన్‌సీ లేజర్ యంత్రంలో చిక్కుకుని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదం తీవ్రతకు ఆయన తల, మొండెం వేరుకావడంతో తోటి కార్మికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే యంత్రాన్ని నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న చర్లపల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యంత్రంలో సాంకేతిక లోపం ఉందా, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం జరిగిందా, లేక ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఫ్యాక్టరీలోని సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకుని పరిశీలించడంతో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. చర్లపల్లి ఇన్‌స్పెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, సుదర్శన్ ఐరన్ ఫాబ్రికేషన్స్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు సురేష్‌బాబు ప్రమాదవశాత్తు సీఎన్‌సీ లేజర్ యంత్రంలో చిక్కుకుని మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. మృతుడు భత్తుల సురేష్‌బాబు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి చర్లపల్లిలోని సుదర్శన్ ఐరన్ ఫాబ్రికేషన్స్‌లో సీఎన్‌సీ లేజర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆయనే ప్రధాన ఆధారం కావడంతో ఆయన ఆకస్మిక మరణం భార్య, పిల్లలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు హృదయవిదారకంగా మారాయి. సీఐటీయూ చొరవతో రూ.31 లక్షల పరిహారం
ప్రమాదం జరిగిన వెంటనే సీఐటీయూ నాయకులు, చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు కంపెనీ యాజమాన్యంతో చర్చలు ప్రారంభించారు. కుటుంబానికి జీవనాధారం కోల్పోయిన నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పలుమార్లు జరిగిన చర్చల అనంతరం మృతుడి కుటుంబానికి రూ.31 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో బాధిత కుటుంబానికి కొంత ఆర్థిక భరోసా లభించింది. ఈ చర్చల్లో సీఐటీయూ నాయకులు, చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బి.వి. సత్యనారాయణ, కార్యదర్శి జి. శ్రీనివాసులు పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి చట్టప్రకారం రావాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్, బీమా తదితర ప్రయోజనాలు కూడా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కూడా సంఘం అండగా ఉంటుందని పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఇటీవల కాలంలో వరుసగా పారిశ్రామిక ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆధునిక యంత్రాల వద్ద పనిచేసే కార్మికులకు తగిన భద్రతా శిక్షణ, నాణ్యమైన రక్షణ పరికరాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థలు ప్రతి పరిశ్రమలో తప్పనిసరిగా ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీలలో భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు. కార్మిక శాఖ, ఫ్యాక్టరీల శాఖ అధికారులు పారిశ్రామిక సంస్థల్లో తరచూ తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు కోరారు. కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో యాజమాన్యాలు ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, లాభాల కంటే కార్మికుల ప్రాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు కార్మిక భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతి