మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:
నల్లబెల్లి మండలం, శనిగరం గ్రామానికి చెందిన పోలేపాక సుభద్ర ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమె భర్త పోలేపాక సూరయ్య (60), వృత్తి కూలి, అప్పుల బాధతో 28వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఇంటిలో ఉన్న పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకోగా, కుటుంబ సభ్యులు అతన్ని మొదట నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రి, వరంగల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం 6.42 గంటలకు మృతి చెందాడు. మృతుని భార్య పోలేపాక సుభద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై ప్రసన్నకుమార్ తెలిపారు.

