Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:

నల్లబెల్లి మండలం, శనిగరం గ్రామానికి చెందిన పోలేపాక సుభద్ర ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమె భర్త పోలేపాక సూరయ్య (60), వృత్తి కూలి, అప్పుల బాధతో 28వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఇంటిలో ఉన్న పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకోగా, కుటుంబ సభ్యులు అతన్ని మొదట నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రి, వరంగల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం 6.42 గంటలకు మృతి చెందాడు. మృతుని భార్య పోలేపాక సుభద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై ప్రసన్నకుమార్ తెలిపారు.

సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..