Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..

నాగయ్యపల్లె లో విషాదం.. ఫిట్స్‌తో యువకుడి ఆకస్మిక మృతి.

మన ప్రగతి న్యూస్ /వేములవాడ రూరల్:

కరెంట్ షాక్ తో మహిళా మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన చెట్టిపల్లి శ్రీకాంత్ (36) ఫిట్స్ రావడంతో ఆకస్మికంగా కన్నుమూశాడు. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకుడు ఒక్కసారిగా అందరికీ దూరం కావడంతో కుటుంబంలోనే కాక గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికుల వివరాల ప్రకారం, అవివాహితుడైన శ్రీకాంత్‌ కు మంగళవారం రోజున అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో స్పృహ కోల్పోయి కుప్పకూలాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామ స్థులు వెంటనే చికిత్స నిమిత్తం వేములవాడ లోనీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే మార్గమధ్యంలోనే ఆయన మృతి చెంది నట్లు వైద్యులు నిర్ధారించారు. చేతికి అందిన కొడుకు అకాల మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి రాజేశ్వరి గుండెలవిసేలా విలపించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. కుమారుడి మృతదేహాన్ని హత్తుకుని ఆమె రోదించిన దృశ్యాలు హృదయాలను కలచివేశాయి. బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ శ్రీకాంత్‌ కు తుది వీడ్కోలు పలికా రు. యువకుడి అకాల మరణంతో నాగాయపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎప్పుడూ అందరితో కలివిడిగా ఉండే శ్రీకాంత్ ఇక లేడనే వార్త గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల గ్రామస్థు లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని తెలియజేశారు.