Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కరెంట్ షాక్ తో మహిళా మృతి

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

నల్లబెల్లి గ్రామానికి చెందిన గద్దె మహేందర్ చెల్లెలు బర్తిపాక లక్ష్మి (వయస్సు 37 సంవత్సరాలు), ఆశా వర్కర్‌గా పనిచేస్తూ ఇటీవల తన అన్న ఇంటిలో నివసిస్తోంది. ఈ రోజు ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ వద్ద బట్టలు ఉంచే సమయంలో అక్కడ బాత్రూమ్ వద్ద ఉన్న విద్యుత్ తీగను అనుకోకుండా తాకడంతో విద్యుత్ షాక్‌కు గురైంది. వెంటనే ఆమె అపస్మారక స్థితిలో పడిపోవడంతో కుటుంబ సభ్యులు సమీప వ్యక్తుల సహాయంతో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిర్వహించినారు. ఇట్టి సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని తెలిపారు.

గోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..