మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
నల్లబెల్లి గ్రామానికి చెందిన గద్దె మహేందర్ చెల్లెలు బర్తిపాక లక్ష్మి (వయస్సు 37 సంవత్సరాలు), ఆశా వర్కర్గా పనిచేస్తూ ఇటీవల తన అన్న ఇంటిలో నివసిస్తోంది. ఈ రోజు ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ వద్ద బట్టలు ఉంచే సమయంలో అక్కడ బాత్రూమ్ వద్ద ఉన్న విద్యుత్ తీగను అనుకోకుండా తాకడంతో విద్యుత్ షాక్కు గురైంది. వెంటనే ఆమె అపస్మారక స్థితిలో పడిపోవడంతో కుటుంబ సభ్యులు సమీప వ్యక్తుల సహాయంతో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిర్వహించినారు. ఇట్టి సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని తెలిపారు.

