Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

గోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..

  • గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని భవాని సతీష్ పిలుపు..
  • గోవు బ్రతికితేనే భూమి బ్రతుకుతుం ది.. గురువు ఉద్బోధ..
  • 70 వేల సంతకాలతో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత.

మన ప్రగతి న్యూస్ /మంచిర్యాల పట్టణ ప్రతినిధి:

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం లోని కామాఖ్య ఆలయంలో గో సం రక్షణకు పెద్ద పీట వేస్తూ”గోమాత సన్మాన్ అభియాన్ సంతకాల సేకరణ కార్యక్ర మం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమాన్ని ఉద్దేశించి మంద మర్రి కామాఖ్య ఆలయం నిర్వాహకులు, ప్రధాన అర్చకులు భవాని సతీష్ పాల్గొని ప్రసంగించారు. గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలి. అనంత రం వారు మాట్లాడుతూ.. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గోమాత ను “జాతీయ మాత”గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మహత్తర కార్యా నికి ప్రతి ఒక్కరూ విలువైన సమయం కేటాయించి, సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చా రు. గోవే భూమికి ఆధారం గోవు బ్రతికి ఉంటేనే భూమి బ్రతికి ఉంటుంది. భూమి మీద మనిషి బ్రతకాలంటే గోవు తప్పని సరి” అని అన్నారు. గో ఉత్పత్తులను వాడడం వల్ల మానవాళి ఆరోగ్యంగా ఉం టుం దని సూచించారు. భారతీయ సంస్కృతిలో గోమాత స్థానం అనాదిగా భారత దేశంలో గో సంతతి సంరక్షణ జరుగుతుందని గుర్తు చేశారు. శ్రీకృష్ణుడు స్వ యంగా గోవులను మేతకు తీసుకెళ్లాడు. శ్రీరాముడు గో రక్షణ చేశాడు. ఛత్ర పతి శివాజీ మహా రాజ్ 14 సంవత్సరాల చిన్న వయసులోనే గోవులను రక్షిం చారు. ఇదే వారి నుండి మనకు వచ్చిన బాధ్యతని పేర్కొన్నారు. ఆవు నుండి లభించే పంచ గవ్యాలు మానవులకు ఆదారం. ప్రాణాలను కూడా కాపాడు తాయని, ఆవులో 33 కోట్ల దేవతలు కొలు వై ఉంటారని, అందుకే గోవును కాపాడుకోవడం ప్రతి హిందువు ప్రతి పౌరుడి కర్తవ్యం అని వివరించారు. అదే విధంగా హిందూ దేవాలయాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంద ని అభ్యర్థించారు. వారు చెప్పిన మాటలు గోమాత పట్ల ప్రేమను, ధర్మం పట్ల నిష్టను రెట్టింపు చేసింది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఈ సంత కాల సేకరణ మహా యజ్ఞాన్ని విజయ వంతం చేసి, గోమాతను రాష్ట్ర మాత హోదాకు చేర్చే దిశగా కృషి చేయాలని కోరా రు. ఈ కార్యక్రమంలో మంథని సతీష్ భవాని (త్రిశక్తి అష్ట లక్ష్మి కామాక్య దేవాలయం గురువు ), హిందూ ఉత్సవ సమితి కార్యదర్శి కర్ణకంటి రవీందర్, రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్ గో సేవ సంయోజక్ వేముల హరిప్రసాద్, విశ్వనాథ ఆలయ మాజీ చైర్మన్ దొంతు ల ముకేశ్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా గో రక్షక్ ప్రముఖ్ దూత రాజా సమ్మ య్య, రాజేందర్, నాగారపు సంతోష్, మందమర్రి ఉత్సవ సమితి సభ్యులు, 100 మంది మహిళా సేవకులు పాల్గొన్నారు.

రైతు హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం -మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్