Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రైతు హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం -మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండలంలోని కనీసం ఒక్క గ్రామంలోనైనా రైతులందరికీ పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ జరిగిందని నిరూపించాలని సవాల్ విసిరారు. రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని, ఎన్నికల హామీల అమలుపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు.ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అనే సామెతను ప్రస్తావిస్తూ రైతుల ఆవేదనను విస్మరించే ప్రభుత్వాలు ఎక్కువకాలం నిలవవని అన్నారు. కేసీఆర్ పాలనలో రైతుబంధు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువుల సరఫరా వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు.ప్రస్తుతం రైతుబంధు నిధులను ఆలస్యంగా, అరకొరగా విడుదల చేస్తున్నారని, యాప్‌ల పేరుతో యూరియా పంపిణీని క్లిష్టతరం చేసి రైతులను క్యూల్లో నిలబడే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరగడంతో ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిని, మోటార్లు కాలిపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఎన్నికల సమయంలో ప్రకటించిన పంటల బోనస్ హామీ ఇప్పటికీ అమలు కాలేదని, దీంతో రైతులు మరోసారి మోసపోయారని విమర్శించారు. మోసపోతే గోస పడతాం అని కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ప్రజలు అదే పరిస్థితిని అనుభవిస్తున్నారని అన్నారు. గత రెండు నెలలుగా వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

భీమారంలో విషాదం..