మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:
తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొం దుతూ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత ఐదు రోజులుగా యశోద ఆసుపత్రిలో వెంటి లెటర్ పై ఉన్న సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి వైద్యులు చనిపోయాడని ప్రకటించారు. అతని అంత్యక్రియలు నల్తబెల్లి లోని న స్వగ్రామంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. అతని మరణంతో కుటుంబ సభ్యులతో పాటు.. నల్లబెల్లి మండల ప్రజలతో పాటు, నర్సంపేట డివిజన్ ప్రజలు మొత్తం శోక సంద్రంలో మునిగిపోయారు.


