మన ప్రగతి న్యూస్/వైరా ప్రతినిధి:
వైరా,తల్లాడ ప్రధాన రహదారిపై సాయిబాబా టెంపుల్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో కారులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్ రావడంలో ఆలస్యం కావడంతో తన ఎస్కార్ట్ వాహనంలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఆపద సమయంలో వెంటనే స్పందించి క్షతగాత్రులకు వైద్య సహాయం అందేలా చేసిన ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు.

