మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసిం
హస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ కు ఆలయ అర్చకులు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, అనంతరం స్వామి వారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించి, ప్రసాదం అందజేశారు.ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది రమేష్, ఓం ప్రకాష్ పాల్గొన్నారు.


