ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి : అధికారంలో ఉన్న అభివృద్ధి చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు..దామెర మండలం లోని పులుకుర్తి, దమ్మన్నపేట, దామెర ,ఒగ్లాపూర్, తక్కళ్లపాడ్, ముస్త్యాలపల్లి గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి బ్యాంక్ ఋణాలు, పావలా వడ్డీ ,స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు…ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ,సన్నబియ్యం ,రైతు రుణమపి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.గ్రామాల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలపర్చిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిల్లా రమణా రెడ్డి,సదిరం పోశాలు,అనిల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి,దామెర శంకర్ ,రాయకోమురు, క్రిష్ణ, అభ్యర్థులు మన్నెం ప్రకాష్ రెడ్డి,కొత్తపల్లి మానస నాగేందర్,తోట కల్పన రాజ్ కుమార్,సొప్పరి రాజేష్ ,బొల్లం స్వప్న వేణు గోపాల్ , డైన0పల్లి కళమ్మ ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

