Breaking News

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత!మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కొల్లిపాక రాజకుమార్ ఆదివారం అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్‌లు ట్రాక్టర్‌ను ఆపి ఇసుక తరలింపునకు అనుమతి పత్రాలు చూయించాలని అడిగారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండటంతో పట్టుకుని కేశవపట్నం పోలీ్‌సస్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.కొల్లిపాక రాజ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు