మన ప్రగతి న్యూస్/శంకరపట్నం
శంకరపట్నం మండలం చింతగుట్ట గ్రామానికి చెందిన కర్క సురేందర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతుడి భార్య కర్క వనజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.మృతుడి కి భార్య,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.సురేందర్ రెడ్డి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నవి.

