మన ప్రగతి న్యూస్/జగదేవ్ పూర్
జగదేవ్ పూర్ కొండపాక మండలాల తహసిల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఆయా మండలాల్లో ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ
మందకొడిగాసాగుతున్నందున అసహనం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ మ్యాపింగ్ 100 శాతం పూర్తి చెయ్యాలి. ఆయా వార్డుల వళ్ళు గా జీపిఓలు, సూపర్ వైజర్ లు, బిఎల్ఓ లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రోగ్రెస్ తక్కువున్నా పోలింగ్ స్టేషన్ లలో బి ఎల్ ఓ ల పనితీరును పర్యవేక్షణ తహసీల్దార్లను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను ఫీల్డ్ స్థాయిలో ఇంటింటి తనిఖీలు వేగవంతం చేయాలని ప్రతి రోజు చేసిన మ్యాపింగ్ వివరాలు కంప్యూటర్ లో అప్లోడ్ చేసే ప్రక్రియను పరిశీలించారు.

