మనప్రగతి న్యూస్ / విశాఖపట్నం:
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో జయ కృష్ణవేణి (30) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలను లోతుగా పరిశీలిస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

