Breaking News

మన ప్రగతి న్యూస్ కథనానికి స్పందన

పైపులైన్ మరమ్మతులతో సమస్య పరిష్కారం

మన ప్రగతి న్యూస్/జహీరాబాద్

నేటి తరానికి ఆదర్శం అంబేద్కర్.

కోహిర్ మున్సిపాలిటీ పరిధిలోని సంజీవ్ నాగర్ కాలనీలో మూడు రోజుల క్రితం మన ప్రగతి న్యూస్ మురుగు నీరు కలిసి తాగునీరు కలుషితం అనే కథనం ప్రచురించగా, వెంటనే స్పందిస్తూ శనివారం మిషన్ భగీరథ ఆధ్వర్యంలో పైపులైన్ మరమ్మతులు జరిపి సమస్యను పరిష్కరించారు.
స్థానిక కాలనీవాసులు సమస్య పరిష్కారం కోసం మన ప్రగతి న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ మరియు పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వారు ప్రతినిధి తక్షణ స్పందన వల్ల సమస్య త్వరగా పరిష్కరించబడిందని, అలాగే మన ప్రగతి న్యూస్ యాజమాన్యాన్ని కూడా అభినందించారు.