మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన యువరైతు సదుల అనిల్ పొలం పనులు ముగించుకుని ఎస్సారెస్పీ కాలువలో బురద బట్టలు శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి నీటి లో కొట్టుకుపోయాడు.గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి గాలింపు చర్యలు చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

